News October 30, 2024
MBNR: కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు వేళాయే..

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 31నుంచి ప్రారంభం కానున్నాయి.
›OCT 31న ఉత్సవాలు ప్రారంభం ›NOV 1న ఆవాహిత దేవతాపూజలు ›2న స్వామివారి కల్యాణం, మయూర వాహనసేవ ›3న హంసవాహన సేవ, ›4న శేషవాహన సేవ ›5న గజవాహన సేవ ›6న బంగారం ఆభరణాలతో అలంకార ఉత్సవం, అశ్వవాహన సేవ ›7న హనుమద్వాహన వాహనసేవ ›8న ఉద్దాల ఉత్సవం, ఉద్దాలకొండపై గురుడ వాహనంపై ఊరేగింపు ›18న స్వామి అలంకారం తీయడంలో ఉత్సవాల ముగింపు
Similar News
News May 7, 2025
MBNR: నీట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

మే 4న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశపుహాల్లో నీట్ పరీక్ష నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో నీట్ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దివ్యాంగులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుందన్నారు.
News May 7, 2025
MBNR: సైబర్ క్రైమ్ బాధితులు గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేయాలి

సైబర్ క్రైమ్ బాధితులు గోల్డెన్అవర్లో పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ శనివారం ఒక ప్రకటన ద్వారా సూచించారు. సైబర్ క్రైమ్ అరికట్టేందుకు అప్రమత్తతే ప్రధాన అస్త్రం అని వెల్లడించారు. ఆన్లైన్ మనీ గేమింగ్ బెట్టింగ్ చట్ట విరుద్ధం అని వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ బెట్టింగ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్ లాంటి పద్ధతులను నేరగాళ్లు ఉపయోగిస్తున్నారన్నారు.
News May 7, 2025
MBNR: ‘ఒప్పంద అధ్యాపకులకు న్యాయం చేయాలి’

పాలమూరు యూనివర్సిటీలోని నిరవధిక సమ్మె చేస్తున్న ఒప్పంద అధ్యాపకులను మహబూబ్గర్ ఎంపీ డీకే అరుణ దీక్షా శిబిరానికి చేరుకొని సంఘీభావం తెలిపారు. శనివారం ఎంపీ మాట్లాడుతూ.. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ, సమస్యల సాధనకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు.