News February 28, 2025
MBNR: చివరి అవకాశం.. నేటితో ముగియనున్న కులగణన సర్వే

మహబూబ్ నగర్ జిల్లాలో నేటితో కులగణన సర్వే ముగియనుంది. గతంలో ప్రభుత్వం సర్వే చేసిన కొందరు వివరాలు నమోదు చేసుకోలేదు. ఇంకా సర్వేలో పాల్గొననివారు, వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో వివరాలు నమోదు అధికారులు సూచించారు. కుల గణనలో పాల్గొనని వారికి ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం ఇవ్వగా.. నేటితో సర్వే ముగుస్తోంది. సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వ పథకాలు దూరమయ్యే అవకాశం ఉంది.
Similar News
News February 28, 2025
MBNR : రంజాన్ను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లాలో రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందరూ ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ.. పోలీసులకు సహకరించాలన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పే బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులు ప్రజలు నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News February 28, 2025
MBNR: 36 పరీక్ష కేంద్రాలు, 22,483 మంది విద్యార్థులు: కలెక్టర్

ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 22,483 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. గురువారం పరీక్షలపై సమీక్షించిన కలెక్టర్, పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేక రవాణా సదుపాయంతో పాటు తాగునీరు వసతి ప్రథమ చికిత్స వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 28, 2025
ఇంటర్మీడియట్ పరీక్షలకు వేళాయె..!

★ మార్చి 5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
★ మహబూబ్ నగర్ జిల్లాలో 22483 మంది ఇంటర్ విద్యార్థులు
★ ప్రథమ సంవత్సరం:10922
★ ద్వితీయ సంవత్సరం:11561 మంది
★ జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
★ పరీక్షల సందర్భంగా 144 సెక్షన్ అమలు
★ సిట్టింగ్ స్వ్కాడ్లు,ఫైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు
★ ఇప్పటికే విడుదలైన హాల్ టికెట్లు
★ పరీక్ష సమయం: ఉ.9 నుంచి మ.12 వరకు
★ పరీక్షకు ఒక రోజు ముందే అన్ని సిద్ధం చేసుకోండి.