News March 29, 2024
MBNR: జవాన్ మృతి.. గ్రామంలో విషాదం
CRPF జవాన్ విష్ణు మృతితో హన్వాడ మండలం వేపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోల్కతా సరిహద్దుల్లో విధి నిర్వహణలో చనిపోయినట్లు వచ్చిన సమాచారంతో విష్ణు సోదరుడు శేఖర్ మరో ఇద్దరితో కలిసి అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. అయితే విష్ణు 18నెలల క్రితమే ఈ ఉద్యోగం సాధించాడని, ప్రొబేషన్ పూర్తికాగా ఇటీవలే పోలీసులు వ్యక్తిగత వివరాలపై విచారణ జరిపారని ఇంతలోనే ఇలా జరిగిందని వారు వాపోయారు.
Similar News
News October 4, 2024
12న పాలమూరుకి సీఎం రేవంత్ రెడ్డి
దసరా పండుగకు సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరికి రానున్నారు. ఈనెల 12న దసరా పండుగ సందర్భంగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని అక్కడ వేడుకలలో పాల్గొంటారు.. అదేవిధంగా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏడాది దసరాను రేవంత్ రెడ్డి ఇక్కడే జరుపుకుంటారు.
News October 4, 2024
రేపు మన్ననూరులో గద్దర్ విగ్రహవిష్కరణ
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామంలో రేపు గద్దర్ విగ్రహవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు పలువురు బహుజన మేధావులు హాజరు అవుతారన్నారు. ఏపూరి సోమన్న బృందంతో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
News October 4, 2024
సంగాల చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే
గద్వాల మండలంలోని సంగాల చెరువులో శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నీటిలో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ఈ ఏడాది నియోజకవర్గంలో ప్రతి చెరువుకు ప్రభుత్వం నుంచి చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.