News March 31, 2024
MBNR: జాతీయ రహదారిపై 5 అండర్ బ్రిడ్జిల నిర్మాణం
అడ్డాకుల: జాతీయ రహదారి 44పై త్వరలో 5 అండర్ బ్రిడ్జిల పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అవి వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం కనిమెట్ట, పెద్దమందడి మండలంలోని వెల్టూర్ స్టేజీ, మూసాపేట మండలంలోని వేముల స్టేజీ, జానంపేట బస్స్టాప్, భూత్పూర్ మండలంలోని శేర్పల్లి(బీ) వద్ద జాతీయ రహదారిపై అండర్ బ్రిడ్జిలను నిర్మించడానికి నిధులు మంజూరు చేయడంతో టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
Similar News
News October 5, 2024
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేటి వర్షపాతం వివరాలవే
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా కల్లూరు తిమ్మన్న దొడ్డిలో 49.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 43.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా వెలుగొండలో 35.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ధన్వాడలో 33.0 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో 17.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
News October 5, 2024
అమ్రాబాద్: గద్దర్ విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయాలి
అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే గద్దర్ విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయాలని బల్మూర్ మండల అంబేడ్కర్ యువజన సంఘం నాయకుడేు గోరటి అశోక్ కోరారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ప్రధానవక్తలుగా కంచ ఐలయ్య, ఏపూరి సోమన్న, గద్దర్ కూతురు వెన్నెల రానున్నారని ప్రజా సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.
News October 5, 2024
అలంపూర్ నూతన పాలక మండలిపై ఆశలు..?
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాల నూతన పాలక మండలితో ఆలయ అభివృద్ధి జరుగుతుందా అని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఆలయంలో ప్రధాన సమస్యలు.. భక్తులు తమ సామన్లు పెట్టుకోవడానికి లాకర్ సౌకర్యం అందుబాటులో లేదు, అన్నదాన సత్రం ఇరుకుగా ఉంది, ఆలయాల ప్రాంగణంలో భక్తులు సేద తీరడానికీ నిలువు నీడ సౌకర్యం లేదు, ఆలయాలకు పార్కింగ్ వేలం పాట ద్వారా రూ. లక్షల ఆదాయం వస్తున్నా.. వాహనాలు ఎండలో ఉండాల్సిన పరిస్థితి.