News December 23, 2024

MBNR: జిల్లాలో పెరిగిన చలి పులి

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొన్నటితో పోలిస్తే చలి తీవ్రత పెరిగింది. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయాన్నే స్నానాలు చేసి బడికి వెళ్లే విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. గత 24 గంటలలో గద్వాల జిల్లా ఇటిక్యాల మం. సాతర్ల గ్రామంలో 18.0, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మం. కేంద్రంలో 15.7, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మం. తోటపల్లి 16.7, వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో 18.1డిగ్రీల కనిష్ఠ నమోదయ్యాయి.

Similar News

News January 9, 2026

MBNR: పిల్లలతో బైక్‌లపై వెళ్లేటప్పుడు తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ

image

చిన్న పిల్లలను బైకులపై తీసుకెళ్లేటప్పుడు పిల్లలను ముందు కూర్చోబెట్టుకోవడం ప్రమాదకరమని MBNR జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు. సంక్రాంతి వేళ ఎగురవేసే గాలిపటాల దారాలు వాహనదారుల మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని, పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, నెమ్మదిగా వాహనాలను నడుపుతూ తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

News January 9, 2026

ఫిబ్రవరి 3 పాలమూరుకు సీఎం రాక

image

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3న సీఎం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో భాగంగా తొలి సభను పాలమూరులో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఉపాధిహామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై నిరసనతో పాటు, ఎన్నికల వ్యూహాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

News January 8, 2026

మహబూబ్ నగర్: భార్యాపిల్లల దాడిలో భర్త దారుణ హత్య

image

మహబూబ్‌నగర్ జిల్లాలో కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పండ్ల వ్యాపారి విస్లావత్ రాములు (56)ను భార్య, పిల్లలే కలిసి కర్రలు, రాడ్లతో కొట్టి చంపడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం రాత్రి గొడవ ముదరడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులు కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.