News September 23, 2025
MBNR జిల్లాలో 315 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లాలో 315 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రతి మండపం వద్ద నిర్వాహకులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ పాయింట్ బుక్స్ ఏర్పాటు చేస్తామని, తనిఖీలకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Similar News
News September 22, 2025
MBNR: నవరాత్రి ఉత్సవాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ జానకి

మహబూబ్నగర్ జిల్లాలో దుర్గా నవరాత్రులు, బతుకమ్మ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని ఎస్పీ డి.జానకి తెలిపారు. మహిళలు, యువతులపై వేధింపులు, ఈవ్టీజింగ్ జరగకుండా ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టామన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 22, 2025
ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన వివిధ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్ మండలం ఉడిత్యాల 97.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. నవాబుపేట మండలం కొల్లూరు 71.5, మహబూబ్ నగర్ గ్రామీణ 50.5, గండీడ్ మండలం సల్కర్ పేట 47.3, భూత్పూర్ 31.3, కోయిలకొండ మండలం పారుపల్లి 24.3, మహమ్మదాబాద్ 19.3, హన్వాడ 18.5, మిడ్జిల్ 9.5, అడ్డాకుల 5.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
News September 22, 2025
MBNR: కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.. UPDATE

MBNRలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ప్రేమ్నగర్ ప్రాంతంలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా విస్తృతమైన కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 300 ఇండ్లను తనిఖీ చేసి,192 ద్విచక్ర వాహనాలు,16 ఆటోలు,17 కారులు పత్రాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 32 బైక్లు, 3 ఆటోలు స్వాధీనం చేసుకుని PSకు తరలించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు,CI అప్పయ్య పాల్గొన్నారు.