News July 26, 2024
MBNR: జిల్లా వ్యాప్తంగా 16,913 కిలోల బెల్లం పట్టివేత

కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో రాష్ట్రానికి బెల్లం రవాణా అవుతున్న విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఆఫీసర్లను అలర్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వారు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అయితే మే 18 నుంచి ఈనెల 11 వరకు ఉమ్మడి జిల్లాలో 16,913 కిలోల బెల్లం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. 400 కిలోల పటికను పట్టుకోగా, ఈ కేసుల్లో 38 వెహికల్స్ సీజ్ చేశారు.
Similar News
News December 30, 2025
BIG BREAKING: మహబూబ్నగర్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా మొదలైంది. భూత్పూర్, దేవరకద్ర, MBNR మున్సిపల్ కమిషనర్లతో EC గిరిధర్ సుందర్ బాబు VC నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు FEBలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది.
SHARE IT
News December 30, 2025
మహబూబ్నగర్: ఆలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ప్రధాన ఆలయాల వద్ద ఎస్పీ డి.జానకి మంగళవారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరించారు.
News December 29, 2025
FLASH: పాలమూరులో మరోసారి ఎన్నికలు

మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో
కౌన్సిలర్లు పోలింగ్కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం..
✒మహబూబ్ నగర్- 60 వార్డుల్లో 2,20,334 మంది జనాభా
✒దేవరకద్ర-12, వార్డుల్లో 12,269 మంది
✒భూత్పూర్-10 వార్డుల్లో 13,938 మంది
ఓటర్ల జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు.


