News February 11, 2025
MBNR: జీరో(0) బిల్లు.. ఉమ్మడి జిల్లాలో ఎంతమందంటే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739271024280_19518427-normal-WIFI.webp)
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇప్పటివరకు మహబూబ్ నగర్-1,29,451, నాగర్ కర్నూల్-1,06,525, నారాయణపేట-77,092, గద్వాల్-84,114, వనపర్తి-80,418 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరూ నెలకు 200 యూనిట్లలోపు(జీరో బిల్) విద్యుత్ వినియోగించుకుంటున్నారు. ఈ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారులు తెలిపారు.
Similar News
News February 12, 2025
భవిష్యత్తు మీదే:ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739282555510_19518427-normal-WIFI.webp)
భవిష్యత్తు మీదే అని మహబూబ్ నగర్ విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులకు తన సొంత నిధులతో ఉచితంగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 10వతరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
News February 11, 2025
MBNR: ఈనెల 14 ,15వ తేదీల్లో మహానగరోత్సవం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739283381774_51916297-normal-WIFI.webp)
ఈనెల 14 ,15వ తేదీలలో మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారామంలో మహబూబ్ నగర్ మహానగరోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. మంగళవారం శిల్పారామం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఉదయం 10:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
News February 11, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739269902856_50011217-normal-WIFI.webp)
బాదేపల్లి మార్కెట్లో ఇవాళ 296 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగ 3,770 క్వింటాళ్లు అమ్మడానికి రాగా గరిష్ఠ ధర క్వింటాలుకు రూ. 6,809 లభించగా కనిష్ఠ ధర రూ. 4,265 లభించింది. కందులు 113 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.7,000, కనిష్ఠ ధర రూ. 4,002 లభించింది. మొక్కజొన్న 142 క్వింటాళ్లు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ. 2,361 కనిష్ఠ ధర రూ. 2,075 లభించింది.