News September 20, 2025
MBNR: దసరా పండుగకు అదనపు బస్సులు

దసరా పండుగ సందర్భంగా అదనపు బస్సులు నడుపుతున్నట్లు మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ Way2Newsతో తెలిపారు. దసరా పండుగ నేపథ్యంలో సొంత ఊర్లకు వచ్చే ప్రయాణికుల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చేనెల రెండు వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, 10 డిపోలలో 641 అదనపు బస్సులను నడుపుతున్నామన్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక వాలంటరీలను, తాగునీటి వసతి ఏర్పాటు చేశామన్నారు.
SHARE IT
Similar News
News September 20, 2025
మహబూబ్నగర్: 23న సౌత్ జోన్ ఎంపికలు

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ ఆలిండియా యూనివర్సిటీ కబడ్డి, ఆర్చరి (స్త్రీ, పురుషుల విభాగంలో) ఎంపికలు ఉంటాయని యూనివర్సిటి PD డా. వై. శ్రీనివాసులు Way2Newsతో తెలిపారు. ఈనెల 23న పాలమూరు యూనివర్సిటీలోని పీజీ కళాశాల గ్రౌండ్లో కబడ్డి (స్త్రీ,పురుషుల) జట్ల ఎంపికలు ఉంటాయని, వయస్సు 17-25లోపు ఉండాలి, ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతోపాటు ఎలిజిబుల్ ఫామ్ పై ప్రిన్సిపల్/PD సంతకం ఉండాలన్నారు.
News September 20, 2025
MBNR: ఆదివారం రామకొండ జాతర

మహబూబ్నగర్ జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకొండపై స్వయంభువుగా వెలసిన శ్రీరాముడి జాతర ఆదివారం జరగనుంది. సంవత్సరంలో అరుదుగా వచ్చే ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నారు. ఈ కొండపై లభించే ఏ వనమూలికలైనా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు.
News September 19, 2025
MBNR: మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక సమావేశం

మహిళలు, బాలికలు, పిల్లల భద్రతకు సంబంధించి పోలీసులతో సమన్వయం చేసుకోడానికి CID SP అన్యోన్య ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. భరోసా, షీ టీమ్, AHTU, కళాబృందం సభ్యులు పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఈ బృందాలు కీలకపాత్ర పోషించాలని SP సూచించారు. అదనపు SP NB రత్నం, DSP వెంకటేశ్వర్లు, DCRB DSP రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.