News March 4, 2025
MBNR: నదిలో దూకి వివాహిత ఆత్మహత్య

దుందుభీనదిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలిలా.. బాలానగర్ మం. గుండేడ్కి చెందిన లక్ష్మి(38)కి 17ఏళ్లక్రితం గంట్లవెల్లికి చెందిన లింగమయ్యతో వివాహమయ్యింది. పెళ్లప్పుడు రూ.1.50లక్షలు,4తులాల బంగారం,బైక్ కట్నంగా ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత భర్త అదనపుకట్నానికి వేధించసాగాడు. దీంతో లక్ష్మి పుట్టింటికి రాగా.. భర్త ఇక్కడికొచ్చి గొడవచేయటంతో మనస్తాపానికి గురై నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News April 22, 2025
నాగర్కర్నూల్: రంపంతో భర్త గొంతు కోసిన భార్య..!

నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ వెంకటేశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. అవుసలికుంటలో కురుమయ్య, చెన్నమ్మ దంపతులు ఉంటున్నారు. ఈనెల 19న భార్యతో కురుమయ్య గొడవపడ్డాడు. అదేరోజు రా.11 గంటలకు భర్త నిద్రిస్తుండగా చెన్నమ్మ కోపంతో వెళ్లి రంపం బ్లేడ్ తీసుకొచ్చి కురుమయ్య గొంతు కోసింది. అతడు అరవగా పక్కింట్లో ఉన్న బంధువులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదైంది.
News April 22, 2025
మహనీయుల చరిత్రను అధ్యయనం చేయాలి: ఉపకులపతి

పాలమూరు యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ & బీసీ సెల్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్ హాజరై, మాట్లాడారు. వారి జీవితం, ఆచరణ, సేవలు, దేశం కోసం చేసిన త్యాగాలు మనందరికీ ప్రేరణగా నిలిచాయని, ఈ మహానీయుల జీవిత చరిత్ర మనకు ఎన్నో విషయాలు నేర్పుతుందని అన్నారు. ఎస్పీ D. జానకి, యూనివర్సిటీ అధ్యాపకులు అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
News April 22, 2025
MBNR: రైతులు అధైర్య పడొద్దు: కలెక్టర్

అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. అడ్డాకులలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఆదివారం కురిసిన వర్షానికి కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు.