News February 1, 2025
MBNR: ‘నాణ్యమైన విద్య అందించాలి’

జిల్లాలోని అన్ని సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. కలెక్టరేట్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పెంచిన డైట్ చార్జీలకు అనుగుణంగా మెనూ అమలు చేస్తూ భోజనంలో నాణ్యత పాటించాలన్నారు. హాస్టల్స్ గురుకులాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వసతి గృహాలు గురుకుల పాఠశాలలో పరిశుభ్రత పాటించాలన్నారు.
Similar News
News March 14, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔ఘనంగా ‘ల్యాబ్ టెక్నీషియన్ డే’
✔రేపే హోలీ..ఊపందుకున్న రంగుల కొనుగోళ్ళు
✔ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి
✔వనపర్తి: కీచక ఉపాధ్యాయులపై సస్పెన్షన్
✔GWL:విద్యారంగానికి నిధులు కేటాయించాలి:BRSV
✔ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలి:ఎస్పీలు
✔ఉమ్మడి జిల్లాలో దంచికొడుతున్న ఎండలు
✔SLBC దుర్వాసన వస్తున్నా… అంతు చిక్కడం లేదు
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
News March 13, 2025
MBNR: ప్రతి దరఖాస్తు పరిష్కరించుకునేలా చూడాలి: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం 31,190మంది దరఖాస్తు చేసుకోగా ప్రతి ఒక్కరు పరిష్కరించుకునేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆర్పిలకు సూచించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి దరఖాస్తుదారుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఈ నెలాఖరు లోగా పరిష్కరించుకుంటే 25% రాయితీ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని వారికి వివరించాలన్నారు.
News March 13, 2025
MBNR: క్రమబద్ధీకరించుకుని రాయితీ పొందండి: కలెక్టర్

అనధికార ప్లాట్లు లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కల్పించిన సదుపాయాన్ని 31190 మంది దరఖాస్తుదారులు క్రమబద్ధీకరించుకుని 25% రాయితీని పొందుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. ముందుకు వచ్చిన దరఖాస్తుదారుడికి వెంటనే పరిష్కరించేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.