News October 9, 2025
MBNR: నామినేషన్ ప్రక్రియ.. పటిష్ట నిఘా: SP

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలో పటిష్ట నిఘా ఉంచినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లాలోని 16 మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని, డీఎస్పీలు, సీఐలు పర్యవేక్షిస్తారని చెప్పారు. కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధనలు ఉంటాయని, బారికేడ్లు ఏర్పాటు చేశామని ఆమె వివరించారు.
SHARE IT
Similar News
News October 9, 2025
MBNR: అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు: ఎస్పీ

ఎన్నికల కోడ్ను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచనలు, నిబంధనల మేరకు వ్యవహరించాలని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించవద్దని ఆమె కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా, ఇతరుల మనోభావాలను కించపరిచేలా పోస్ట్లు పెట్టినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News October 9, 2025
ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం

మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో 13.8 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్లో 8.5 మి.మీ., జడ్చర్లలో 6.5 మి.మీ., నవాబుపేటలో 3.5 మి.మీ., మిడ్జిల్లో 2.8 మి.మీ., కౌకుంట్ల 2.0 మి.మీ., చిన్నచింతకుంటలో 1.8 మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
News October 9, 2025
స్థానిక సమరం.. ఉమ్మడి పాలమూరు రెడీ

స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి పాలమూరు జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో, గురువారం ఎంపీటీసీ/జడ్పీటీసీ నామినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో 39 జడ్పీటీసీ, 426 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్లెల్లో ఇప్పటికే ఎన్నికల సందడి నెలకొంది.