News March 22, 2025
MBNR: నీటి కోసం మూడేళ్లుగా ఉపాధ్యాయుడి పోరాటం

ఉమ్మడి జిల్లాలోని కోస్గి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు వీరు మల్లేష్ “WALK FOR WATER’ అనే నినాదంతో ఉమ్మడి జిల్లాలోని ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలో పర్యటిస్తూ.. విద్యార్థులకు నీటి యొక్క ప్రాముఖ్యతను, నీటిని సంరక్షించుకునే విధానాన్ని వివరిస్తూ నీటి ప్రతిజ్ఞ చేయిస్తూ.. గత మూడేళ్లుగా నీరు వృధా కాకుండా ఎలా ఉపయోగించుకోవాలో ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. వరల్డ్ వాటర్ డే సందర్భంగా “Way2News” ప్రత్యేక కథనం.
Similar News
News March 24, 2025
MBNR: ప్రజావాణిలో బాధితులు మొర

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో ప్రజావాణికి బాధితులు క్యూ కట్టారు. ఈ ఫిర్యాదులో భాగంగా సోమవారం గిరిజన రుణాలు, భూమి, కార్మికుల, ప్రాజెక్టుల పరిహారం, సీనియర్ సిటిజన్స్, ఇందిరమ్మ ఇల్లు, భూముల కబ్జా, రైతులకుపంట నష్టపరిహారం తదితర సమస్యలపై జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని కలిసి తమ గోడును విన్నవించారు. వారు స్పందించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్
News March 24, 2025
మహబూబ్నగర్: ‘ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలి’

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి భూపాల్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారని, కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా పోరాటాలను మాత్రం ఆపలేరని భూపాల్ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
News March 24, 2025
MBNR: మాజీ మంత్రి VS MLA.. తగ్గేదేలే..!

మహబూబ్నగర్లో రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు మాజీ మంత్రి, BRS మాజీ MLA శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫైర్ అవుతున్నారు. 14 నెలల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేసిందంటున్నారు. మరోవైపు MLA యెన్నెం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. అప్పులు చేసి ఆగం చేసింది BRS వాళ్లే అని కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?