News July 3, 2024
MBNR: నేటితో ముగియనున్న MPTCల పదవీ కాలం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719964113001-normal-WIFI.webp)
ఉమ్మడి పాలమూరు జిల్లాలో MPTC సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. 2019 జులై 3న మండల పరిషత్ కొలువుదీరాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 719 మంది MPTCలు ఉన్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్కో ఎంపీటీసీకి రూ.7.50లక్షలు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాల్లో సీసీ, డ్రైనేజీలకు కేటాయించారు. తమ డిమాండ్ల ఒక్కటీ నెరవేరలేదని, ఆరు నెలలుగా వేతనం ఇవ్వలేదని ఉమ్మడి జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రఘునాథ్ పేర్కొన్నారు.
Similar News
News July 5, 2024
ఉమామహేశ్వరంలో మంత్రులు, ఎమ్మెల్యేలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720161657299-normal-WIFI.webp)
అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయాన్ని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజానర్సింహా, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, పలువురు దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.
News July 5, 2024
నల్లమల్ల పర్యటనకు పాలమూరు ఎమ్మెల్యేలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720155722152-normal-WIFI.webp)
నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శుక్రవారం నల్లమల్ల అటవీ ప్రాంతంలో పర్యటనకు బయలుదేరారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం నల్లమల్లలో పర్యటించి ఇక్కడ నెలకొన్న పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు.
News July 5, 2024
మహబూబ్ నగర్: 8న అప్రెంటిస్ షిప్ మేళా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720136909463-normal-WIFI.webp)
MBNR:ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 8న జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బి.శాంతయ్య తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాను ఉమ్మడి జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బయోడేటా, ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్,2 పాస్ ఫొటో సైజ్ ఫొటోలతో పాటు బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాల సెట్ తో హాజరు కావాలన్నారు.