News February 21, 2025

MBNR: నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన.. రూ.5 లక్షల సబ్సిడీ

image

సీఎం రేవంత్ నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్‌మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.

Similar News

News February 22, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలకు చేర్పింలి: కలెక్టర్లు
✔పాలమూరులో భారీ అగ్నిప్రమాదం
✔రైతు భరోసాకే దిక్కులేదు.. ఇండ్లు ఎలా ఇస్తారు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
✔ఘనంగా అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం
✔GDWL:AP పోలీసులు దౌర్జన్యం చేశారు:BRS
✔ప్రపంచం సోషలిజం వైపు చూస్తోంది:CPM
✔NRPT: మహిళా పెట్రోల్ బంకును ప్రారంభించిన సీఎం
✔హామీలపై(BRS,BJP) చర్చకు సిద్ధమా:CM రేవంత్‌రెడ్డి

News February 21, 2025

వనపర్తి: పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు!

image

ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండలంలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. బొల్లారానికి చెందిన శ్రీనివాస్ గౌడ్(50) భార్య పిల్లలతో కలిసి MBNRలో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం బంధువు ఒకరు చనిపోవటంతో శ్రీనివాస్ గ్రామానికి వచ్చారు. కాగా.. కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో విరక్తి చెంది తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 21, 2025

MBNR: గొంతు కోసుకున్నాడు..!

image

మహమ్మదాబాద్ మండలంలో ఓ యువకుడు కుటుంబ సమస్యల కారణంగా గొంతు కోసుకున్న ఘటన గురువారం జరిగింది. స్థానికుల వివరాలిలా.. చౌదర్‌పల్లికి చెందిన ఖాసీం ఇంట్లో గొడవల కారణంగా మనస్తాపానికి గురై బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

error: Content is protected !!