News March 21, 2025

MBNR: పదోతరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ

image

పదో తరగతి పరీక్షలను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మహత్మా గాంధీ రోడ్, క్రీస్తు జ్యోతి విద్యాలయం, భూత్పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ తీరును ఆమె ఈరోజు పరిశీలించారు. మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 9, 2025

MBNR: తుప్పు పట్టిన 104 అంబులెన్స్‌లు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో దాదాపు ఆరు 104 అంబులెన్స్‌లు నిలుచున్న తోనే తుప్పు పట్టి తూట్లు పడుతున్నాయి. వాటికి మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకువస్తే కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉండదని ప్రజలు అంటున్నారు. డీఎంహెచ్వో కృష్ణయ్యను Way2News వివరణ అడగగా.. ఆ వాహనాలు వేలం కోసం ఉన్నాయని, వేలంలో అమ్ముతామని తెలిపారు.

News November 9, 2025

MBNR: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

image

మహబూబ్‌నగర్ జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. చలి తీవ్రత పెరిగింది. దీంతో ఉదయం వేళ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కంపెనీలో పనిచేసే కార్మికులు, పాఠశాల కళాశాలకు వెళ్లే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్, రాజాపూర్ గండేడ్ మండలాలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అన్నారు.

News November 9, 2025

పాలమూరు:పంచరామాలకి ప్రత్యేక బస్

image

కార్తీక మాసం సందర్భంగా పుణ్య క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక హైటెక్ బస్ నడుపుతున్నట్లు మహబూబ్ నగర్ డిపో మేనేజర్ బి.సుజాత ‘Way2News’తో తెలిపారు. ఈ నెల 15న ఉ. 7:00 గంటలకు మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి, APలోని పంచారామాలు దర్శన అనంతరం 17న మహబూబ్ నగర్‌కు చేరుకుంటుందన్నారు. ఛార్జీలు పెద్దలకు రూ. 2400/-, పిల్లలకు రూ.1500/-, వివరాలకు 94411 62588, 99592 26286 సంప్రదించగలరు.