News March 25, 2025
MBNR: పసి బిడ్డలకు ఏం తెలుసు అమ్మానాన్న మళ్లీ రారని..!

ఊహ తెలియని వయసులోనే వారి తల్లిదండ్రులు చనిపోయారు.. అనాథలుగా మారిన ఆ పిల్లలకు ఏం తెలుసు అమ్మానాన్న మళ్లీ రారని..ఆకలైనప్పుడు అమ్మా అని ఎన్నిసార్లు పిలిచినా అమ్మ రావట్లేదని ఆ పిల్లలు అంటున్న మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. గద్వాల(D),మల్దకల్(M), చర్లగార్లపాడులోని ముగ్గురు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. నేడు అయిజ(M) యాపదిన్నె వాసులు రాకేశ్, రామాంజనేయులు వారికి రూ.10,500ఆర్థిక సాయం చేశారు.
Similar News
News December 18, 2025
యారాడ తీరానికి కొట్టుకొచ్చిన భారీ వేల్ సార్క్ చేప

విశాఖలోని యారాడ సాగర్ తీరానికి 3 టన్నుల బరువైన వేల్ సార్క్ చేప కొట్టుకొచ్చింది. ఫారెస్ట్ రేంజ్ ఎస్ఐ వెంకట శాస్త్రి తన సిబ్బందితో తీరానికి చేరుకొని పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. చాలా అరుదుగా కనిపించే ఈ సార్క్ చేప మత్స్యకారుల వలకు చిక్కుకొని చనిపోయిందా? లేదా మరేదైనా కారణమా అని విచారణ చేస్తున్నారు.
News December 18, 2025
OG కోసం సొంత కారు అమ్మిన డైరెక్టర్!

డైరెక్టర్ సుజీత్కు హీరో పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్ ఇచ్చిన <<18579913>>విషయం<<>> తెలిసిందే. ఆ కారును పవన్ గిఫ్ట్గా ఎందుకిచ్చారో సినీవర్గాలు తెలిపాయి. ‘OGలోని కొన్ని సీన్లు జపాన్లో షూట్ చేద్దామనుకుంటే బడ్జెట్ వల్ల నిర్మాత ఒప్పుకోలేదు. ఈ సీన్ ప్రాధాన్యం దృష్ట్యా సుజీత్ తన కారు అమ్మేసి షూట్ పూర్తిచేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్.. అదే మోడల్ కారును గిఫ్ట్గా ఇచ్చారు’ అని పేర్కొన్నాయి.
News December 18, 2025
పొన్నలూరు: బాకీ డబ్బుల కోసం మహిళ నిరసన.!

పొన్నలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ మధురైకి చెందిన మహిళ గురువారం అతని ఇంటి ఎదురుగా నిరసనకు దిగింది. తమ నుంచి రూ.68 లక్షలు తీసుకొని, చెల్లించాల్సిన ఇన్స్టాల్మెంట్ చెల్లించడం లేదంటూ మధురై నుంచి వచ్చి నిరసన తెలిపింది. సదరు వ్యక్తి లేకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అనూక్ మాట్లాడి నిరసన విరమింపజేశారు.


