News March 25, 2025
MBNR: పసి బిడ్డలకు ఏం తెలుసు అమ్మానాన్న మళ్లీ రారని..!

ఊహ తెలియని వయసులోనే వారి తల్లిదండ్రులు చనిపోయారు.. అనాథలుగా మారిన ఆ పిల్లలకు ఏం తెలుసు అమ్మానాన్న మళ్లీ రారని..ఆకలైనప్పుడు అమ్మా అని ఎన్నిసార్లు పిలిచినా అమ్మ రావట్లేదని ఆ పిల్లలు అంటున్న మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. గద్వాల(D),మల్దకల్(M), చర్లగార్లపాడులోని ముగ్గురు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. నేడు అయిజ(M) యాపదిన్నె వాసులు రాకేశ్, రామాంజనేయులు వారికి రూ.10,500ఆర్థిక సాయం చేశారు.
Similar News
News October 19, 2025
ముడతలు తొలగించే గాడ్జెట్

వయసు పెరిగే కొద్దీ కొంతమందికి చర్మంపై ముడతలు, మొటిమలు వంటివి వస్తాయి. వీటిని తగ్గించడానికి ఫేషియల్ నెక్ మసాజర్ ఉపయోగపడుతుంది. ఈ గాడ్జెట్ని ఉపయోగించే ముందు మాయిశ్చరైజర్/ సీరమ్ ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మసాజ్ చెయ్యాలి. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా మారి ముడతలు తగ్గుతాయి. డబుల్ చిన్ తగ్గించడంలో కూడా ఈ మసాజర్ ఉపయోగపడుతుంది.
News October 19, 2025
IND vs AUS: 35 ఓవర్లకు మ్యాచ్ కుదింపు

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేను వర్షం వల్ల 35 ఓవర్లకు కుదించారు. ప్రతి బౌలర్ గరిష్ఠంగా 7ఓవర్లు వేసే అవకాశం ఉంది. 12.20PMకు మ్యాచ్ రీస్టార్ట్ అయింది. వర్షం కారణంగా మ్యాచ్ ఇప్పటి వరకు రెండుసార్లు నిలిచిపోయింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(6), అక్షర్ పటేల్(7) ఉన్నారు.11.5 ఓవర్లకు భారత్ స్కోర్ 37/3గా ఉంది.
News October 19, 2025
ముదిగుబ్బలో యువకుడు ఆత్మహత్య

ముదిగుబ్బలో ఆదివారం ఉదయం రమేష్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. మృతుడి భార్య కుమారుడితో కలిసి ఇదే గ్రామంలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో అతను తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి కార్మికుడు పనికోసం రమేష్ ఇంటికి వెళ్లి చూడగా ఉరివేసుకుని వేలాడుతున్నాడు. అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.