News June 28, 2024
MBNR: పాలమూరు రాష్ట్రంలోనే అవినీతిలో NO.1
ఈ ఏడాది అవినీతి కేసుల నమోదులో పాలమూరు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అత్యధికంగా అవినీతి కేసులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2024 జనవరి నుంచి ఈ నెల 26 వరకు మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. పోలీసు శాఖకు సంబంధించి మూడు, రెవెన్యూ, విద్యుత్ శాఖలవి రెండు చొప్పున, ఎక్సైజ్, మున్సిపల్ శాఖలవి ఒకటి చొప్పున కేసులు నమోదు అయ్యాయి.
Similar News
News September 20, 2024
MBNR: మధ్యాహ్న భోజన బిల్లులు రూ.1.94 కోట్లు విడుదల
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోడి గుడ్ల కోసం రూ.1.94 కోట్లు విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. దీంతో వంట కార్మికుల ఇబ్బందులు తొలగనున్నాయి.
News September 20, 2024
MBNR: ఆశావహులతో స్థానిక ఎన్నికలు దోబూచులు
పాలమూరు జిల్లా ఆశావహులతో స్థానిక సంస్థల ఎన్నికలు దోబూచులాడుతున్నాయి. ఫిబ్రవరి 2024తో గత పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసింది. సుమారు 9 నెలలు కావస్తున్నా సర్పంచ్, ఎంపీటీసీల ఎన్నికలపై స్పష్టత రాలేదు. కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు నిర్ణయించాకే ఎన్నికలు జరుపుతామని సీఎం ప్రకటించారు. దీంతో మరో 4 నెలలు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోందని, వనపర్తి జిల్లా 255 పంచాయతీల్లో పోటీ చేసే ఆశావాహులంటున్నారు.
News September 20, 2024
పాలమూరు ప్రజలపై నెలకు రూ.3.60 కోట్ల భారం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సగటున నెలకు 18 లక్షల కిలోల వంట నూనెలను ప్రజలు వాడుతున్నారు. ఇటీవలే కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఒక్కసారిగా వంట నూనెల ధరలు పెరిగాయి. నూనెల ధరలు సరాసరి ఒక్కో లీటరుపై రూ.20 పెరుగుదల అనుకుంటే..రూ.3.60 కోట్లు ప్రజలు అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వంటనూనెల పెరుగుదల సంకటంగా మారింది.