News October 16, 2025

MBNR: పీయూలో ఘనంగా స్నాతకోత్సవం!

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం ఆడిటోరియంలో 4వ స్నాతకోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గురువారం మొత్తం 83 బంగారు పతకాలను పీయూ ఛాన్స్‌లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పీయూ ఉపకులపతి(VC) ఆచార్య డాక్టర్ జీఎన్ శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సంవత్సరంలో ఆయా విభాగాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన 12 మంది పరిశోధకులు పట్టాలు అందుకున్నారు.

Similar News

News October 17, 2025

త్వరలో కౌలు రైతులకు యూనిక్ ఐడీ నంబర్!

image

AP: రాష్ట్రంలోని కౌలు రైతులకు(పంట సాగుదారు హక్కుపత్రం) యూనిక్ ఐడీ నంబర్ జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో భూములున్న రైతులతో పాటే వీరు కూడా రాయితీలు, ప్రయోజనాలు పొందే అవకాశముంటుంది. ఇప్పటి వరకూ భూములున్న రైతులకే కేంద్రం విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తోంది. CM చంద్రబాబు సూచనల మేరకు కౌలు రైతులకూ ఈ నంబర్ జారీ చేయడంపై దృష్టి సారించింది. టెక్నికల్‌గా పరీక్షించిన తర్వాత దీనిని అమలు చేయనుంది.

News October 17, 2025

చిత్తూరు: సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు

image

చిత్తూరు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలను నిర్వహించనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ వెంకటరమణమూర్తి తెలిపారు. ఇందుకు రూ.5 వేలను ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలన్నారు. ముందుగానే ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని, అవసరమైన పత్రాలతో కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 17, 2025

అధికారులకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేయండి: కలెక్టర్

image

గృహ నిర్మాణ ప్రగతిపై నిర్వహించిన సమావేశానికి హాజరుకాని ఐదుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణాల లక్ష్యసాధనలతో అధికారులు కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రగతిని సాధించాలన్నారు. లక్ష్యసాధనలో వెనుకబడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గృహ నిర్మాణంలో అలసత్వం వహించే కాంట్రాక్టులను తొలగించి కొత్తవారిని నియమించాలన్నారు.