News January 27, 2026
MBNR: పెరిగిన ఉష్ణోగ్రతలు.. తగ్గుతున్న చలి

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాజాపూర్లో అత్యల్పంగా 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మూడు రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగాయి. జడ్చర్ల, మిడ్జిల్లో 15.1, భూత్పూర్లో 16.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రథసప్తమి ముగియడంతో ఇకపై ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
Similar News
News February 19, 2026
MBNR: ముస్లిం ఉద్యోగులకు రంజాన్ వేళల్లో సడలింపు

రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని PU విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనివేళల్లో సడలింపు ఇస్తున్నట్లు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగులందరూ సాయంత్రం ప్రార్థన (నమాజ్) చేసుకోవడానికి వీలుగా ప్రతిరోజూ గంట ముందుగా (సా. 04:00 గంటలకు) యూనివర్సిటీ నుంచి వెళ్లేందుకు అనుమతి మంజూరు చేశామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
News February 19, 2026
MBNR: అంబేడ్కర్ వర్సిటీ 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ ప్రారంభం

మహబూబ్నగర్ MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సైన్స్, కంప్యూటర్ విద్యార్థులకు 5వ సెమిస్టర్ ప్రయోగ తరగతులు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. 80% హాజరు ఉన్న విద్యార్థులనే అనుమతిస్తారని ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మావతి తెలిపారు. మరిన్ని వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించాలని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. సత్యనారాయణ గౌడ్ సూచించారు.
News February 19, 2026
MBNR: రంజాన్.. ఉపవాస దీక్షలు ప్రారంభం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించుకుంది. పవిత్రమైన రంజాన్ మాసం నేపథ్యంలో నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్న నెలవంక కనిపించడంతో ముస్లింలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మసీదులను విద్యుద్వీపాలతో అలంకరించారు. నెలరోజులపాటు తరావీ నమాజ్లు చేయనున్నారు. ఇప్పటికే రంజాన్ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటును కల్పిస్తూ.. GOVT ఉత్తర్వులు జారీ చేసింది.


