News October 8, 2025
MBNR పోలీసులను అభినందించిన డీఐజీ

MBNRలో నేరాల నివారణ, చట్టాలను కాపాడటంలో జిల్లా పోలీసు బలగాలు చూపుతున్న కృషిని జోన్–VII డీఐజీ ఎల్.ఎస్.చౌహన్ అభినందించారు. పోలీస్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత క్రమశిక్షణతో ప్రజాసేవలో అగ్రగాములు కావాలని ఆకాంక్షించారు. బలగాల హాజరు రికార్డులు, ఆయుధ నిల్వలు, వాహనాల సంరక్షణ విధానాన్ని పరిశీలించి సిబ్బంది నిబద్ధతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News October 8, 2025
MBNR: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు

మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. తొలి విడతలో 8 జడ్పీటీసీ, 89 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 8, 2025
మహబూబ్నగర్లో డీఐజీ చౌహన్ తనిఖీలు

మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. డీపీఓ, స్పెషల్ బ్రాంచ్, డీసీబీ, ఏఆర్ హెడ్క్వార్టర్స్ తదితర విభాగాలను పరిశీలించారు. వివిధ విభాగాల పనితీరు, రికార్డు నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ, పారదర్శకత వంటి అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎస్పీ డి. జానకి, అదనపు ఎస్పీలు ఎన్.బి. రత్నం, సురేష్ కుమార్ పాల్గొన్నారు.
News October 8, 2025
ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: మధుసూదన్ రెడ్డి

దేశంలో ప్రధాని మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని MBNR జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణపై జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తోందని, ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని పేర్కొన్నారు.