News March 17, 2025

MBNR: ప్రజావాణికి 130 ఫిర్యాదులు

image

 ప్రజావాణికి 130 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Similar News

News March 18, 2025

MBNR: తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టండి: కలెక్టర్

image

వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఛాంబర్‌లో తాగునీరు, విద్యుత్ సమస్యపై సమీక్షించారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా విద్యుత్ సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు.

News March 18, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్ ✔ముదిరాజులను BC-Aలో చేర్చాలి:ముదిరాజులు ✔జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి ✔ఎంపీ డీకే అరుణ నివాసంలో పోలీసులు ✔పెరుగుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించండి: కలెక్టర్లు ✔సాగునీరు అందక రైతులకు ఇబ్బందులు:NHPS ✔వట్టెం వెంకన్నస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు ✔NGKL:SLBC D1,D2 ప్రదేశాలు గుర్తింపు:కలెక్టర్ ✔మద్దూర్:విద్యుత్తు తీగలు తాకి లారీ దగ్ధం          

News March 17, 2025

జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్‌ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.

error: Content is protected !!