News October 11, 2024

MBNR : ప్రారంభంలో పత్తి ధర అదుర్స్.. తర్వాత డమాల్ !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ పంటల సాగులో పత్తిదే అగ్రస్థానం. ఉమ్మడి జిల్లాల్లో 9.50 లక్షల ఎకరాల వరకు రైతులు పత్తి సాగు చేశారు. ప్రస్తుతం ధర రూ.6 వేలు నుంచి రూ.6,500 వరకు పలుకుతుంది. పత్తి ధర ప్రారంభంలో రూ.8,100 ధర ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా పడిపోతున్న ధరలను చూసి రైతులు అమ్మకాలు జరపకుండా ఇంట్లో నిల్వ ఉంటుకుంటున్నారు. ప్రభుత్వం పత్తి ధరను పెంచాలని కోరుతున్నారు.

Similar News

News October 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా రేవల్లిలో 31.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంటలో 24.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కృష్ణలో 13.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా మల్దకల్ లో 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 11, 2024

MBNR: DSCలో 967 పోస్టుల భర్తీ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీ-2024లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 967 మందికి నియామక పత్రాలు అందజేశారు. జిల్లా మొత్తం 1131 పోస్టులు ఉండగా 164 పోస్టులు పెండింగులో ఉన్నాయి. వీటిల్లో NGKL జిల్లాలో 59, మహబూబ్ నగర్ జిల్లాలో 29, గద్వాలలో 23, వనపర్తిలో 26, నారాయణపేటలో 27 పోస్టులను రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, కోర్టు కేసులు, తదితర కారణాలతో భర్తీ చేయలేదు.

News October 11, 2024

వనపర్తి: అత్యాచారం.. ఆపై హత్య

image

గోపాల్‌పేట మం. ధర్మాతండాకు చెందిన <<14319594>>శాంతమ్మ<<>> మృతి కేసును పోలీసుల ఛేదించారు. పోలీసుల వివరాలు.. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు విచారణలో తేలింది. వనపర్తిలో ఉంటున్న NGKL జిల్లా పెంట్లవెల్లికి చెందిన ప్రభాకర్.. స్థానిక గాంధీ చౌక్‌లో కూరగాయలు కొంటున్న శాంతమ్మను మాటల్లో పెట్టాడు. మద్యం తాగించి తీసుకెళ్లి చిమనగుంటపల్లి శివారులో అత్యాచారం చేశారు. అనంతరం పక్కనే ఉన్న బావిలో తోసి అక్కడి నుంచి పరారయ్యాడు.