News March 23, 2025
MBNR: భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

నూతనంగా నిర్మిస్తున్న భవనంపై నుంచ పడి వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. గాజులపేటకు చెందిన రమేశ్(42) పీయూ ఆవరణలో నిర్మిస్తున్న భవనంలో పనులు చేస్తుండగా జారి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని జనరల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం HYDకి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News March 25, 2025
పాలమూరుకు మరో మంత్రి పదవి..!

పాలమూరు జిల్లాకు మరో మంత్రి రానుందని టాక్. మక్తల్ MLA వాకిటి శ్రీహరి ముదిరాజ్కు మంత్రి పదవి దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో పార్టీ అధిష్ఠానంతో చర్చ అనంతరం మంత్రివర్గ విస్తరణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. మార్చి30న ఉగాది పండగ రోజు కొత్త మంత్రులు రానున్నారు.కాగా ఉమ్మడి MBNR నుంచి CM రేవంత్ రెడ్డి (కొడంగల్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) మంత్రులుగా ఉండగా శ్రీహరితో ఆ సంఖ్య 3కు చేరనుంది.
News March 25, 2025
MBNR: ఈనెల 26వ తేదీన ఉద్యోగమేళ

ఈనెల 26వ తేదీన బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రి ప్రియ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో నిర్వహించే ఈ ఉద్యోగమేళాకు విజయ ఫెర్టిలైజర్స్, ట్రెండ్స్, ధ్రువంత్ సొల్యూషన్స్ లాంటి సంస్థలు పాల్గొంటున్నాయని వెల్లడించారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన 30 ఏళ్లలోపు యువకులు అర్హులని వెల్లడించారు.
News March 25, 2025
మహబూబ్నగర్: రెండు పథకాలు.. ఈనెల 31 లోపు ఖాతాల్లోకి డబ్బులు

సీఎం రేవంత్ రెడ్డి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా, భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.6,000 చొప్పున మార్చి 31 లోపు జమ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రైతు భరోసా కోసం రూ.18,000 కోట్లు కేటాయించింది. ఉగాది పండుగ నాటికి అర్హులకు పూర్తిగా జమచేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.