News September 20, 2024

MBNR: మధ్యాహ్న భోజన బిల్లులు రూ.1.94 కోట్లు విడుదల

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోడి గుడ్ల కోసం రూ.1.94 కోట్లు విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. దీంతో వంట కార్మికుల ఇబ్బందులు తొలగనున్నాయి.

Similar News

News September 20, 2024

మహబూబ్‌నగర్: తండ్రిని చంపేశాడు..!

image

ఓ యువకుడు తండ్రిని హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజాపూర్ మండలం రాయపల్లికి చెందిన కావలి నారాయణని అతడి కుమారుడు నందు హత్య చేశాడు. గురువారం రాత్రి అందరూ పడుకున్నాక గొడ్డలితో నరికి చంపాడు. నందుకు కొంత కాలంగా మతిస్థిమితం లేదు. ఏ పని చేయకుండా ఊర్లో తిరుగుతుండేవాడు. కాగా రోజూ నారాయణ ఇంటికి గొళ్లెం పెట్టుకునేవాడు. రాత్రి పెట్టుకోకపోవడంతో అదును చూసి చంపేయగా నందును పోలీసులు అరెస్ట్ చేశారు.

News September 20, 2024

MBNR: ఆశావహులతో స్థానిక ఎన్నికలు దోబూచులు

image

పాలమూరు జిల్లా ఆశావహులతో స్థానిక సంస్థల ఎన్నికలు దోబూచులాడుతున్నాయి. ఫిబ్రవరి 2024తో గత పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసింది. సుమారు 9 నెలలు కావస్తున్నా సర్పంచ్, ఎంపీటీసీల ఎన్నికలపై స్పష్టత రాలేదు. కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు నిర్ణయించాకే ఎన్నికలు జరుపుతామని సీఎం ప్రకటించారు. దీంతో మరో 4 నెలలు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోందని, వనపర్తి జిల్లా 255 పంచాయతీల్లో పోటీ చేసే ఆశావాహులంటున్నారు.

News September 20, 2024

పాలమూరు ప్రజలపై నెలకు రూ.3.60 కోట్ల భారం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సగటున నెలకు 18 లక్షల కిలోల వంట నూనెలను ప్రజలు వాడుతున్నారు. ఇటీవలే కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఒక్కసారిగా వంట నూనెల ధరలు పెరిగాయి. నూనెల ధరలు సరాసరి ఒక్కో లీటరుపై రూ.20 పెరుగుదల అనుకుంటే..రూ.3.60 కోట్లు ప్రజలు అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వంటనూనెల పెరుగుదల సంకటంగా మారింది.