News February 27, 2025
MBNR: మహిళపై దాడి.. చికిత్స పొందుతూ మృతి

ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన భూత్పూర్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. మండలంలోని కొత్త మోల్గర గ్రామానికి చెందిన రంగమ్మ (50) మంగళవారం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ముని రంగస్వామి దేవాలయం వద్ద ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా రక్తపుమడుగులో కొట్టుమిట్టాడింది. గమనించిన స్థానికులు పోలీసులకు తెలపగా MBNR ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
Similar News
News July 5, 2025
BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్

నల్గొండ జిల్లా కట్టంగూరులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. శాలిగౌరారం మండలం ఊట్కూరు వాసి రజనీకాంత్ HYDలో ఉంటూ పని చేస్తున్నాడు. ఈరోజు స్వగ్రామంలో బంధువు చావుకు వచ్చి, తిరిగి HYDకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రజనీకాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News July 5, 2025
విద్యా కిట్లు వెంటనే అందించాలి: పద్మశ్రీ

ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య, సరైన వసతులు, సరైన ఆహారం, అవసరమైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జిల్లా పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ పద్మశ్రీ అన్నారు. శనివారం ఏలూరులో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యా కిట్ల పంపిణీ కొన్ని మండలాల్లో ఆలస్యం అయినట్లు గుర్తించామన్నారు. కిట్స్ వెంటనే అందించాలన్నారు.
News July 5, 2025
శుభ్మన్ గిల్ ఆల్టైమ్ రికార్డ్

టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆల్టైమ్ రికార్డ్ బద్దలు కొట్టారు. ఒక టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా అవతరించారు. ఇంగ్లండ్తో రెండో టెస్టులో గిల్ ఫస్ట్ ఇన్నింగ్సులో 269, రెండో ఇన్నింగ్సులో 80 రన్స్ కలిపి 349* పరుగులు చేశారు. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ (344) రికార్డును ఆయన చెరిపేశారు. వీరిద్దరి తర్వాత లక్ష్మణ్ (340), గంగూలీ (330), సెహ్వాగ్ (319) ఉన్నారు.