News July 13, 2024
MBNR: మాది ప్రజల పార్టీ: MLA

మాది ప్రజల పార్టీ అని, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కాంగ్రెస్ నేత, కల్వకుర్తి MLA కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ మండలం గుండాలలో అంబ రామలింగేశ్వర స్వామి పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. AICC సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డి, నాయకులు బాలాజీ సింగ్, భూపతిరెడ్డి, సందీప్ రెడ్డి, ఆశాదీప్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News February 3, 2026
జడ్చర్ల: గురుకుల పాఠశాల విద్యార్థుల అదృశ్యం.. ముంబైలో ప్రత్యక్షం

జడ్చర్ల మండలం నాగసాల సమీపంలోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆదివారం పాఠశాలలో చీటీ రాసి తాము ఐదేళ్ల తర్వాత వస్తామని అదృశ్యమయ్యారు. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు విచారణ నిర్వహించి విద్యార్థులు ముంబైలో ఉన్నట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించి విద్యార్థులను పట్టుకున్నారు. విద్యార్థులను తీసుకురావడానికి వారి తల్లిదండ్రులు పోలీసులు ముంబైకి వెళ్లారు.
News February 3, 2026
పాలమూరు కార్పొరేషన్లో ఖాతా తెరిచిన కాంగ్రెస్

మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ అధికార కాంగ్రెస్ పార్టీ అప్పుడే తన ఖాతాను తెరిచింది. పాలమూరు కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే మార్గం సుగమమైంది. రాజేంద్రనగర్ ప్రాంతంలోని 58వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి ఎన్నిక లాంఛనమైంది. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో హస్తం పార్టీ జెండా ఎగిరింది.
News February 2, 2026
MBNR: ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు: SP

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు పంపిణీ చేసి ప్రలోభాలకు గురిచేస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ జానకి హెచ్చరించారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ ఆమె ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులపై నిఘా పెంచాలని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీస్ బలగాలను సిద్ధంగా ఉంచాలని ఎస్పీ సూచించారు.


