News March 23, 2025

MBNR: మార్చి 31తో ముగియనున్న ఎస్సీ ఉపకార వేతనాల గడువు

image

ఎస్సీ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే గడవు మార్చి 31తో ముగియనుందని షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు సుదర్శన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 70% మాత్రమే దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు చేసుకొని వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్‌లను కోరారు. విద్యార్థులు బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ సీడింగ్ చేయించుకోవాలన్నారు.

Similar News

News March 24, 2025

కొడంగల్: విషాదం.. యువకుడి మృతి!

image

యువకుడు ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడంగల్ పరిధి మద్దూరులో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. మండలంలోని గోకుల్ నగర్‌ వాసి సాయిలు(21) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయంపై తండ్రి మందలించాడని ఈనెల 17న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడని మద్దూర్ ఎస్ఐ తెలిపారు.

News March 24, 2025

MBNR: 24న ఆశావర్కర్స్ ‘చలో హైదరాబాద్’

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆశా కార్యకర్తలు CITU ఆధ్వర్యంలో తమ సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కురుమూర్తి మాట్లాడుతూ.. కార్మికులకు రూ.18 వేతనం, పీఎఫ్, ఈపీఎఫ్, గ్రాటివిటీ, పెన్షన్ ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆశాకార్యకర్తలు వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

News March 24, 2025

MBNR: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో గద్వాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. గద్వాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!