News May 16, 2024
MBNR: మొత్తం 5,575 పదో తరగతి ఫెయిల్

ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం 44,898 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో 39,323 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,575 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 2,127 మంది అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 526 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరందరూ జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు.
Similar News
News December 16, 2025
MBNR: 16న..U-19 షటిల్ బ్యాట్మెంటన్ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు షటిల్ బ్యాట్మెంటన్ ఎంపికలను ఈనెల 16న మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు పీడీ సాదత్ ఖాన్ (89198 71829)కు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT.
News December 15, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

✒PHASE-3 ఎన్నికలకు భారీ బందోబస్తు:ఎస్పీలు
✒NGKL: నిన్న గెలుపు.. అర్ధరాత్రి మృతి
✒PHASE-3 పూర్తయ్యే వరకు MCC అమల్లోనే: ఎస్పీ
✒100% ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి:కలెక్టర్లు
✒PHASE-3 ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్లు
✒పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒నూతన సర్పంచులను అభినందించిన ఎమ్మెల్యేలు
✒పోలింగ్ సామగ్రి పంపిణీ: కలెక్టర్లు
News December 15, 2025
MBNR: ఆరోజు వైన్ షాపులు బంద్: ఎస్పీ

పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో లేదా 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కార్డ్లెస్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పూర్తిగా నిషేధమని ఎస్పీ డి.జానకి తెలిపారు. మూడో విడుత సర్పంచ్ ఎన్నికల భద్రతా దృష్ట్యా మద్యం దుకాణాలు ఈనెల 15 సా.5:00 గంటల నుంచి 18 ఉ.10:00 గంటల వరకు పూర్తిగా మూసివేయాలని, మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


