News March 22, 2025

MBNR: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

image

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT

Similar News

News March 22, 2025

జడ్చర్ల: ‘విద్యుత్ సరఫరా లేక ఎండుతున్న పంటలు’

image

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేక నీళ్లు పెట్టకపోవడంతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని కిష్టారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా Way2Newsతో రైతు పి.వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా సరిగా లేక వేల పెట్టుబడితో పెట్టిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నామని, విద్యుత్ అధికారులు స్పందించి 24 గంటలు కరెంట్ సరఫరా చేయాలని అన్నారు.

News March 22, 2025

MBNR: నిరుద్యోగ యువతకు తప్పని సమస్య..!

image

నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం కింద లబ్ధిపొందేందుకు రేషన్ కార్డు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని పలువురు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసినప్పటికీ, పాత రేషన్ కార్డు తొలగించాల్సిన నిబంధనతో సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. పెళ్లయిన వారు తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లోనే కొనసాగుతుండడంతో కొత్త కార్డు పొందడానికి సమస్య ఎదురవుతోందని, దీంతో పథకానికి అప్లై చేయని పరిస్థితి నెలకొందన్నారు.

News March 22, 2025

ట్రాన్స్‌జెండర్ MURDER.. మహబూబ్‌నగర్‌లో నిరసన

image

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ట్రాన్స్‌జెండర్ హత్యకు నిరసనగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ట్రాన్స్‌జెండర్లు శుక్రవారం నిరసన తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల అధ్యక్షురాలు సుకన్య మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష మాని, తమ సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ట్రాన్స్‌జెండర్ హత్యకు కారణమైన నిందితుడిని ఉరితీసి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

error: Content is protected !!