News February 1, 2025
MBNR: రిజర్వాయర్లో పడి చిన్నారులు మృతి
ఉదండాపూర్ రిజర్వాయర్లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు ఉదండాపూర్ రిజర్వాయర్ పక్కన వ్యవసాయ పొలం ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేష్(4) శనివారం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిని గుంతలో పడడంతో మహేష్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 1, 2025
నరసరావుపేట: యువతిని బెదిరించి రూ. 11 లక్షలు స్వాహా
నరసరావుపేటకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సాయిసత్య శ్రీ అనే యువతిని ఆన్లైన్లో బెదిరించి రూ. 11 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. టూ టౌన్ సీఐ హైమారావు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొరియర్లో తనకు గంజాయి వచ్చిందని, తనను అరెస్టు చేయటానికి స్పెషల్ పోలీసులు వస్తున్నారని ఫోన్ కాల్ వచ్చిందని వివరించారు. 2వ రోజే తన అకౌంట్లో రూ. 11లక్షలు కనిపించలేదన్నారు.
News February 1, 2025
మహబూబాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. మండలస్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.
News February 1, 2025
పార్వతీపురం : మార్చి 8న జాతీయ లోక్ అదాలత్
మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు రెండవ అదనపు జిల్లా జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అధ్యక్షులు ఎస్.దామోదరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పెండింగ్లో ఉన్న కేసులు, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.