News March 31, 2024

MBNR: రెండు పార్లమెంట్ స్థానాలకు ఇన్చార్జిల నియామకం

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి పాలమూరులోని రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను AICC నియమించింది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా AICC కార్యదర్శి సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా మంత్రి జూపల్లి కృష్ణారావులను నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News September 10, 2025

రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌కు ఘన స్వాగతం

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఆదాయ వనరుల పెంపుపై సమీక్షించేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకిలు మొక్కలను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

News September 9, 2025

MBNR: ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌.. CONGRATS తెలిపిన డీకే అరుణ

image

భారత ఉపరాష్ట్రతిగా NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌ ఎన్నికయ్యారు. దీంతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ 452 ఓట్లతో విజయం సాధించారు. ఇవాళ ఉదయం డీకే అరుణ దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తన ఓటును సద్వినియోగం చేసుకున్నారు.

News September 9, 2025

రేపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సిరిసిల్ల రాజయ్య రాక

image

రేపు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య రానున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అంతకుముందు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయనకు జిల్లా అధికారులు స్వాగతం పలకనున్నారు.