News February 12, 2025
MBNR: రెండు రోజులకు శవమై తేలింది!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739338738830_1292-normal-WIFI.webp)
ఇంట్లో గొడవపడి బయటికెళ్లిపోయిన మహిళ శవమై తేలిన ఘటన గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. పగిడ్యాల్కి చెందిన పద్మమ్మ(38) ఆదివారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు అలిగి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత పగిడ్యాల్ మల్లమ్మచెరువులో శవమై తేలింది. పద్మమ్మకు భర్త, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదైంది.
Similar News
News February 12, 2025
Stock Markets: షార్ప్ రికవరీతో హ్యాపీ.. హ్యాపీ..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1732502136538_1199-normal-WIFI.webp)
దేశీయ స్టాక్మార్కెట్లలో షార్ప్ రికవరీ జరిగింది. బెంచ్మార్క్ సూచీలు రోజువారీ కనిష్ఠాల నుంచి బలంగా పుంజుకున్నాయి. ఆరంభంలో 200Pts నష్టపోయిన నిఫ్టీ ప్రస్తుతం 34 pts లాభంతో 23,108 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ -600 నుంచి +89కి చేరుకొని 76,377 వద్ద చలిస్తోంది. ఫైనాన్స్, మెటల్, బ్యాంకు, మీడియా రంగాలు ఇందుకు దన్నుగా నిలిచాయి. SBILIFE, BAJAJFINSV, HDFCLIFE, ULTRACEMCO, ADANIENT టాప్ గెయినర్స్.
News February 12, 2025
శెభాష్ పోలీస్.. నిమిషాల్లో ప్రాణం కాపాడారు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739342287593_746-normal-WIFI.webp)
AP: ఆర్థిక ఇబ్బందులతో కోనసీమ జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీజ్ చేయగా పోలీసులు అతణ్ని కాపాడి శెభాష్ అని అనిపించుకున్నారు. అయినవెల్లి CI భీమరాజుకు ఫిర్యాదు రావడంతో లొకేషన్ గుర్తించి అన్నవరంలో ఉన్న SI శ్రీహరికి సమాచారమిచ్చారు. వీడియో లాడ్జీలోనిదని గుర్తించి నగరంలోని లాడ్జీ ఓనర్లను అలర్ట్ చేశారు. ఉరేసుకునేముందు వారు తలుపు నెట్టి కాపాడారు. ఇదంతా 6 నిమిషాల్లోనే జరగడం విశేషం.
News February 12, 2025
బిక్కనూర్: చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739345160730_51904015-normal-WIFI.webp)
చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన బిక్కనూర్లో వెలుగుచూసింది. 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న బొబ్బిలి చెరువులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు చెరువు వద్ద పరిశీలించగా కుళ్లిన మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు చెట్టపల్లి రాజశేఖర్గా గుర్తించారు.