News September 21, 2024
MBNR: రేపే సవరణ.. 28న తుది జాబితా
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న ఓటర్ జాబితా ముసాయిదాను అధికారులు విడుదల చేశారు. ఇప్పటికే మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న పార్టీలతో సమావేశాలు నిర్వహించారు. ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 21వ తేదీ వరకు తెలియజేయవచ్చని, 28న తుది ఓటర్ జాబితాను విడుదల చేస్తామని డీపీఓ పార్థసారథి తెలిపారు.
Similar News
News September 21, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు !
✒పలు ఆదర్శ పాఠశాలలో నూతన ప్రిన్సిపల్ లు బాధ్యతలు స్వీకరణ
✒ భారీ వర్షం
✒MBNR:యాక్సిడెంట్లో మహిళ మృతి
✒పలు గ్రామాలలో కొనసాగిన ఫ్రైడే-డ్రైడే
✒రేపు సవరణ.. 28న ఓటరు తుది జాబితా
✒గండీడ్:కలెక్టర్ తనిఖీ
✒పలుచోట్ల మీలాద్-ఉన్-నబి వేడుకలు
✒బాల కార్మిక నిర్మూలనపై అవగాహన
✒మధ్యాహ్న భోజనం.. రూ.1.94 కోట్ల నిధులు విడుదల
✒అక్టోబరు 3 నుంచి ఓపెన్ టెన్త్,ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
News September 20, 2024
MBNR: గుండెపోటుతో క్రీడాకారుడి మృతి
నవాబ్పెట మండలం ఎన్మనగండ్ల గ్రామానికి చెందిన జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు ఆయాజ్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడని ఆయన మిత్రులు తెలిపారు. ఆయన లేకపోవడం జాతీయ వాలీబాల్ జట్టుకు తీరని లోటు అని వారి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News September 20, 2024
బాధ్యులను కఠినంగా శిక్షించాలి: డీకే అరుణ
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు టెస్టుల్లో నిర్ధారణ కావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని MBNR ఎంపీ అరుణ అన్నారు. దురదృష్టకరమైన ఘటనను హిందూ సమాజం ఖండిస్తుందని, ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. దీనిపై ప్రత్యేక కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చలని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.