News October 15, 2025

MBNR: రేపే స్నాతకోత్సవం.. 83 గోల్డ్ మెడల్స్ ప్రదానానికి సిద్ధం

image

పీయూలో 4వ స్నాతకోత్సవం ఈనెల 16న ఉదయం 10:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ స్నాతకోత్సవంలో..
✒83 బంగారు పతకాలు
✒12 పీహెచ్.డీలు. (కెమిస్ట్రీ-5, మైక్రోబయాలజీ-5, బిజినెస్ మానేజ్మెంట్-1, కామర్స్-1)
✒2,809 పీజీ, 8,291 ప్రొఫెషనల్ కోర్సులు, 18,666 యూజీ డిగ్రీలు ప్రదానం చేయనున్నారు.
✒PU సిబ్బందితో కూడిన 7 కమిటీలు ఏర్పాటు.
✒రెండో దశ NAAC అక్రిడిటేషన్ పూర్తి చేసుకుంది.

Similar News

News October 15, 2025

ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య

image

ఆలమూరు మండలం చిలకలపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. కామరాజు తన ఇద్దరు కుమారులు అభిరామ్ (10), గౌతమ్ (7) లను చంపి, అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ విద్యాసాగర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 15, 2025

ఆర్డీవో నివేదిక జాప్యంపై కరీంనగర్ కలెక్టర్‌కు ఫిర్యాదు

image

135 రోజుల తర్వాత కూడా తన ఫిర్యాదుపై తుది నివేదిక ఇవ్వకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 23న ప్రజావాణిలో ఫేక్ సర్టిఫికెట్తో జాబ్ చేస్తున్నాడని వీఆర్ఏపై ఫిర్యాదు చేసిన బాధితుడికి, కలెక్టర్ 2025 ఏప్రిల్ 25న హుజురాబాద్ ఆర్‌డిఓను 15రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆర్‌డీఓ మూడు సార్లు నోటీసులు జారీ చేసి, సెప్టెంబర్ 12న విచారణ పూర్తి చేసిన తుది నివేదిక అందించలేదని వాపోయాడు.

News October 15, 2025

KNR: నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమం

image

స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ డా.వరలక్ష్మి అధ్యక్షతన భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.‌ ఈ సమావేశంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్లు డా.మొగిలి, డా.లక్ష్మణరావు, పెద్ది స్వరూప, డా.స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.