News March 25, 2025
MBNR: ‘లంబాడీ గిరిజనులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి’

గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి సంక్షేమానికి కృషి చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు నాయక్ కోరారు. MBNRలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తండాలను పంచాయతీలుగా, గోర్ బోలి భాషను 8 షెడ్యూల్లో, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, నిరుద్యోగ భృతి,గిరిజనులకు ట్రైకార్ రుణాలు మంజూరు చేసి న్యాయం చేయాలన్నారు. గిరిజన సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే అసెంబ్లీ ముట్టడి చేస్తామన్నారు.
Similar News
News March 28, 2025
పాలమూరు: ‘వంద గజాల ప్లాటుకు రూ.3,81,26,542 LRS’

MBNR మున్సిపాలిటీ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన తిరుపతయ్యకు 100 గజాల స్థలం ఉంది. ఆ ప్లాటుకు రూ.3,81,26,542 LRS చలాన్ వచ్చింది. అవాక్కయిన తిరుపతయ్య వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. ఇదేంటంటూ వాకబు చేశారు. పొరపాటు జరిగిందంటూ LRSను రూ.12,009కి కుదించారు. అయితే తన పక్కనే ఉన్న 100 గజాల ప్లాట్కు రూ.9,380 మాత్రమే వచ్చిందని తిరుపతయ్య తెలిపారు.
News March 28, 2025
MBNR: ఎల్ఆర్ఎస్కు గడువు మూడు రోజులే… 51,490 దరఖాస్తులు

LRS దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం విధించిన గడువు 3రోజుల్లో ముగియనుంది. కానీ దరఖాస్తులేమో 51,490 పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తుల్ని పరిష్కరించుకునే వారికి ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించిన దరఖాస్తుదారుల్లో ఏమాత్రం స్పందన కనిపించడంలేదు. వీరికి అవకాశం కల్పిస్తే తమకు ఆదాయం వస్తుందని భావించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. MBNRలో 29,390, జడ్చర్ల 16,500, భూత్పూర్ 5,600 ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి.
News March 28, 2025
మహబూబ్నగర్ TO తాండూర్ రూట్లో కొనసాగుతున్న పనులు

మహబూబ్నగర్ నుంచి తాండూర్ వెళ్లే రూట్లోని ఇబ్రహీంబాద్ వద్ద రహదారి మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో వాహనాలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి. చకచకా పనులు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక నాయకులు పర్యవేక్షిస్తున్నారు.