News March 24, 2025
MBNR: వరి సాగు పెరిగింది.. జలమట్టం తగ్గింది..!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాది యాసంగిలో 4,76,079 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇదే సీజన్లో 5,43,466 ఎకరాల్లో వరి సాగు కాగా.. గత సంవత్సరం ఇదే సీజన్తో పోలిస్తే 67,387 ఎకరాల్లో అధికంగా వరి సాగైనట్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడంతో సాగు చేసిన వరి ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 26, 2025
అత్యధిక ఫిర్యాదులు.. మూడో స్థానంలో అనకాపల్లి జిల్లా

సమస్యలపై అనకాపల్లి జిల్లా నుంచే అత్యధిక ఫిర్యాదులు అందినట్లు వెల్లడయ్యింది. CM చంద్రబాబుతో నిన్న జరిగిన సమావేశంలో CS విజయానంద్ పేర్కొన్నారు. గత జూన్ 15 నుంచి ఈ మార్చ్ 19 వరకు జిల్లాలో 45,884 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. అందులో రెవెన్యూకు రిలేటెడ్ కంప్లైంట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. కాగా.. ఎక్కువ ఫిర్యాదులు అందిన జిల్లాల్లో రాష్ట్రంలోనే అనకాపల్లి మూడో స్థానంలో ఉంది.
News March 26, 2025
‘కోర్ట్’: USలోనూ అదిరిపోయే కలెక్షన్లు

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో రామ్ జగదీశ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘కోర్ట్’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.50+ కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్లోనూ దూసుకెళ్తోంది. అమెరికా గడ్డపై $1 మిలియన్ మార్క్ను క్రాస్ చేసినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. కంటెట్ ఉన్న సినిమాలను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. OTT రిలీజ్కు కాస్త టైమ్ పట్టొచ్చని సినీవర్గాలు తెలిపాయి.
News March 26, 2025
బీఆర్ఎస్ చేసిన అతి పెద్ద స్కామ్ ‘మన ఊరు-మన బడి’: అక్బరుద్దీన్

TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కాళేశ్వరం కంటే పెద్ద కుంభకోణమని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ‘బీఆర్ఎస్ చేసిన మిగతా స్కామ్స్ అన్నీ చాలా చిన్నవి. మన ఊరు-మన బడి కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించాలి. 4823 ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు లేవు. బాలికలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.