News March 26, 2025

MBNR: వలస కార్మికులకు నివాసయోగ్యమైన ప్రభుత్వ పాఠశాలలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రూరల్ మండలం (వెంకటాపూర్) అవతలిగడ్డ తండా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వలస కార్మికులకు నివాస యోగ్యమైంది. సరస్వతి నిలయాల్లో వలస కార్మికులు మద్యం, గుట్కా, ధూమపానం సేవిస్తూ పాఠశాల మౌలిక వసతులను అపరిశుభ్రం చేసి, ధ్వంసం చేస్తున్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు మూతబడిన పాఠశాలను వెంటనే తెరిపించి, బడి బయట ఉండే విద్యార్థులను పాఠశాలలో చేరే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News September 18, 2025

శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు: SP

image

జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని SP హర్షవర్ధన్‌రాజు సూచించారు. గురువారం పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో అదనపు SPలు, DSPలు, CI, SIలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణపై పలు సూచనలు చేశారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News September 18, 2025

ఈ-గవర్నెన్స్ సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేయాలి – కలెక్టర్

image

విశాఖలో సెప్టెంబ‌ర్ 22, 23న జరిగే 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. నోవాటెల్ హోటల్‌లో జరిగే ఈ సదస్సులో ఐటీ నిపుణులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారని తెలిపారు. 13 ప్రధాన, 10 ఉప కమిటీల సమన్వయంతో నగర సుందరీకరణ, భద్రత, శానిటేషన్ తదితర చర్యలు చేపట్టాలని సూచించారు.

News September 18, 2025

తల్లిదండ్రులకు సత్వర న్యాయం చేయాలి: జగిత్యాల కలెక్టర్

image

జగిత్యాల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో దివ్యాంగుల & వయోవృద్ధుల జిల్లా కమిటీ సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులను విస్మరించే కుమారులు, కోడళ్లు, వారసులకు సీనియర్ సిటిజన్స్ కమిటీ ప్రతినిధులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు. ఫిర్యాదులు ఇచ్చే వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల స్పందించి వారికి సత్వర న్యాయం చేయాలన్నారు.