News December 5, 2025
MBNR: విద్యార్థికి వేధింపులు.. ఇద్దరు సస్పెండ్

జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థిని వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్ రజిని రాగమాల, వైస్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మిని సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థిని వేధింపులకు పాల్పడిన సంఘటన ఉమ్మడి జిల్లాలో గురువారం సంచలనంగా మారింది. DSP వెంకటేశ్వర్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Similar News
News December 7, 2025
ప్రైవేటు హాస్పిటల్స్, లాబ్స్ యాజమాన్యంతో DMHO సమావేశం

విశాఖ పరిధిలోని అన్ని ప్రైవేటు హాస్పిటల్స్,లాబ్స్ యాజమాన్యంతో DMHO జగదీశ్వర రావు శనివారం సమావేశం నిర్వహించారు. ప్రైవేటు హాస్పిటల్స్ యజమానులు అందరూ హెచ్.పి.ఆర్, హెచ్.ఎఫ్.ఆర్. రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలనన్నారు. రిసెప్షన్ వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ నెల 21న పల్స్ పోలియోకు సహకరించాలని సూచించారు.
News December 7, 2025
రెండు మూడేళ్లుగా ఇలా ఆడలేదు: కోహ్లీ

ఇటీవలికాలంలో తాను ఈ తరహాలో ఆడలేదని విరాట్ కోహ్లీ తెలిపారు. ‘ఈ సిరీస్లో ఆటతో సంతృప్తిగా ఉన్నాను. నిజాయతీగా చెప్పాలంటే గడిచిన రెండు మూడేళ్లలో ఈ విధంగా ఆడలేదు. 15-16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో కొన్నిసార్లు మన సామర్థ్యంపై అనుమానం కలుగుతుంది. మిడిల్ ఆర్డర్లో ఇలా ఆడితే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలుసు’ అని కోహ్లీ చెప్పారు. కాగా SAపై కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో అదరగొట్టారు.
News December 7, 2025
‘విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తా’

విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ నారాయణస్వామి పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం జిల్లాలో పటష్ఠంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.


