News March 26, 2025
MBNR: 1052 మంది రక్తదానం చేశారు: నటరాజు

షహీద్ దివస్ను పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ సంస్థలు, కళాశాలలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాల్లో మొత్తం 1052 మంది యువత రక్తదానం చేశారని ఐఆర్సీఎస్ ఛైర్మన్ నటరాజు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రక్తదాన శిబిరాలను నిర్వహించగా.. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని తెలిపారు.
Similar News
News March 26, 2025
మహబూబ్నగర్ POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన..?

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. కాగా MBNR డీసీసీ చీఫ్గా MLA మధుసూదన్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు NP.వెంకటేశ్, వినోద్, సిరాజ్, రబ్బానీ ఆశావహులుగా ఉన్నారు.
News March 26, 2025
కొడంగల్: తిరుపతిరెడ్డిపై పోస్ట్.. యువతిపై కేసు నమోదు

సీఎం రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతిరెడ్డి ఈనెల 22న కోస్గి మండలం బిజ్జూరంలో పర్యటించారు. ఆ సమయంలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతిపై కేసు నమోదు చేసినట్లు SIబాల్రాజ్ తెలిపారు. తిరుపతిరెడ్డి భూకబ్జాలు చేసేందుకు వచ్చాడని హన్మాన్పల్లి వాసి పద్మ వాట్సాప్ గ్రూపుల్లో ఆధారాలు లేకుండా తప్పుడు మెసేజ్ చేసిందని NSUIఅధ్యక్షుడు అశోక్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.
News March 26, 2025
MBNR: ఆర్టీసీ బస్టాండ్లో కంకర తేలిన సీసీ రోడ్డు

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో సీసీ రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచి కంకర తేలి, గొయ్యిలా ఏర్పడి ప్రయాణికులు, విద్యార్థులకు, ఆర్టీసీ బస్సు వాహనాదారులకు ఇబ్బందికరంగా మారింది. వెంటనే రోడ్డు, రవాణా, ఆర్టీసీ అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.