News July 8, 2024

MBNR: 14న జగన్నాథ రథయాత్ర మహోత్సవం

image

శ్రీజగన్నాథ రథయాత్ర మహోత్సవం పాలమూరులో ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ఎం.యాదిరెడ్డి, రాజమల్లేశ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు పాలమూరు భక్త బృందం ఆధ్వర్యంలో కీర్తనలు, నృత్యాలు, భజనలు, కోలాటాలతో పరమాద్భుతమైన ఉత్సవంగా జరగనుందని చెప్పారు.

Similar News

News October 6, 2024

NGKL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పర్యాటక టూర్లు

image

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పురాతన గుడులు
పర్యటక ప్రదేశాలను చూపించనున్నారు. తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా 2,4 తరగతుల ఒక్కో విద్యార్థికి రూ.300/- 5, 8 తరగతుల వారికి రూ.800/-, 9,ఇంటర్, వారికి రూ.2000/-డిగ్రీ విద్యార్థులకు రూ.4000/-చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించడం జరుగుతుంది. 3వేల విద్యార్థులకు అవకాశం దక్కనుందని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు వెల్లడించారు.

News October 6, 2024

జూరాలలో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి

image

జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది. శనివారం ఎగువలో 5 యూనిట్ల ద్వారా 196 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ సూరిబాబు తెలిపారు.
ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 442.534 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు.

News October 6, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పడిపోయిన ఉల్లి సాగు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,600 ఎకరాల్లో సాగయ్యే ఉల్లి పంట ఈ సారి 1,200 ఎకరాలకు పడిపోయింది. గత ఏడాది ఉల్లి సాగు చేసిన రైతులకు సరైన గిట్టుబాటు ధర దొరకకపోవడంతో ఈ ఏడాది సాగు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఉల్లి కొరత ఏర్పడి ధర పెరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో సాగు చేసిన కొద్దిపాటి ఉల్లి పంట కూడా దెబ్బతింది. క్వింటా ఉల్లి ధర జూలైలో రూ.2 వేలు ఉండగా.. సెప్టెంబరులో రూ.5,600 లకు పెరిగింది.