News June 20, 2024

MBNR: 229 మంది SAలు, GHMలకు పదోన్నతులు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 229 మంది ఎస్ఏలు, జీహెచ్ఎంలుగా పదోన్నతి పొందారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు, ఎన్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతలు, ఎస్జీటీల బదిలీలు చేపట్టాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోని 3,230 పాఠశాలల్లో 12,708 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. వారిలో సుమారు 700 మందికి పదోన్నతులు పొందనుండగా మరో 8 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

Similar News

News November 10, 2025

MBNR: నీటి వనరుల గణనపై జిల్లా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

image

రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు, 7వ చిన్న నీటి పారుదల గణన, రెండో నీటి వనరుల గణన 2023-24 కోసం జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.

News November 10, 2025

MBNR: ఫిర్యాదులపై తక్షణ చర్యలు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి. జానకి స్వయంగా ప్రజల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. ఆమె వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పర్యవేక్షిస్తామని ఎస్పీ తెలిపారు.

News November 10, 2025

బాదేపల్లి మార్కెట్‌లో ధరల వివరాలు

image

జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సోమవారం మొక్కజొన్న 6,683 క్వింటాళ్లు అమ్మకానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠంగా రూ.1,977 ధర లభించింది. వడ్లు (ఆర్‌ఎన్‌ఆర్‌) 1,307 క్వింటాళ్లు రాగా, గరిష్ఠంగా రూ.2,419 పలికింది. హంస రకం వడ్లకు గరిష్ఠ ధర రూ.1,858 లభించినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి తెలిపారు.