News July 1, 2024
MBNR: 3,929 మంది టీచర్లకు స్థాన చలనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719802196755-normal-WIFI.webp)
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే 1,725 మంది SAలకు బదిలీ అయ్యారు. మరో 1,975 మంది SGTలు SAలుగా, 229 మంది SAలు GHMలుగా పదోన్నతి పొందారు. వివిధ విభాగాల్లో కలిపి ఉమ్మడి జిల్లాలో 3,929 మంది ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో విధుల్లో చేరారు. ప్రస్తుతం ఎస్జీటీల బదిలీలతో మరో రెండు వేల మందికి స్థాన చలనం కలగనుంది. ఒకే పాఠశాలలో 8ఏళ్ల పాటు పనిచేసిన SGTలు విధిగా మరో పాఠశాలకు బదిలీ కానున్నారు.
Similar News
News July 3, 2024
బదిలీ అయినా SGTలకు తప్పని తిప్పలు !
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719965520005-normal-WIFI.webp)
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,448 మంది ఎస్జీటీ సమాన స్థాయి ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో సుమారు 2,413 మంది కొత్త స్థానాల్లో విధుల్లో చేరగా.. మరో 1,095 మంది ఉపాధ్యాయులు కొత్త ఉపాధ్యాయులను నియమించే వరకు పాత స్థానాల్లోనే కొనసాగాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు, మారుమూల తండాలు, శివారు గ్రామాల్లో కొత్త ఉపాధ్యాయులు రాకపోవడంతో అవి మూతపడే పరిస్థితి నెలకొంది.
News July 3, 2024
మాల్ ప్రాక్టీస్ విద్యార్థులు కమిటీ ముందు హాజరుకండి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719935759524-normal-WIFI.webp)
ఇటీవల పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన పరీక్షలలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడి బుక్ అయిన విద్యార్థులు వ్యక్తిగతంగా మాల్ ప్రాక్టీస్ కమిటీ ఎదుట బుధవారం ఉదయం 11:30 గంటలకు హాజరుకావాలని పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మరింత సమాచారం కోసం www.palamuruuniversity.com సైట్ను సంప్రదించాలన్నారు.
News July 3, 2024
ఉమ్మడి జిల్లాలో 244 కళాశాలలు.. ఇద్దరే పీడీలు !
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719952469236-normal-WIFI.webp)
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 81 ఉన్నాయి. వీటిలో 40,746 మంది విద్యార్థులు, జూనియర్ కళాశాలలు 163 ఉన్నాయి. వీటిలో 29,297 మంది చదువుతున్నారు. మొత్తం 70వేల మందికి ఇద్దరే ఫిజికల్ డైరెక్టర్లు (వ్యాయామ అధ్యాపకులు) ఉన్నారు. ఒకరు జడ్చర్ల ప్రభుత్వ కళాశాలలో, మరొకరు ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నారు. PDలు లేకపోవడంతో క్రీడ రంగంలో విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారు.