News April 22, 2024
MBNR: 85ఏళ్లు దాటిన వారికి ‘హోం ఓటింగ్’
85ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఇంటివద్దనే ఓటు వేసే సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ విభాగం నోడల్ అధికారి శ్రీధర్ సుమన్ అన్నారు. వృద్ధులకు ఎన్నికల సంఘం ‘హోం ఓటింగ్’ కల్పించిందని ఆయన తెలిపారు. ఓటు విలువపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యం పటిష్టతకు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
Similar News
News October 1, 2024
యువతలో సృజనాత్మకత వెలికి తీయాలి: సిక్తా పట్నాయక్
యువతలో దాగిన సృజనాత్మకత వెలికి తీయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జాతీయ యువజన ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సైన్స్ ఫెయిర్ లో ఆవిష్కరణలను పరిశీలించారు. విద్యార్థులు, యువకులు చేసిన నృత్యాలను చూసి అభినందించారు. సైన్స్ ఫెయిర్ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.
News September 30, 2024
NRPT: గురుకుల పాఠశాలలో కలెక్టర్ రాత్రి బస
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం రాత్రి బస చేశారు. రాత్రి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాల వంటగదికి వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంట సామాగ్రి, నిత్యావసర సరుకులను, తాగునీటిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే పాఠశాలలో నిద్రించారు.
News September 30, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు.. !
✒దౌల్తాబాద్:అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
✒ఉమ్మడి జిల్లాలో దసరా వేడుకలు షురూ
✒మెదక్ పై పాలమూరు ఘనవిజయం..ఇక సెమి ఫైనల్
✒GDWL: మహిళపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
✒దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి:RS ప్రవీణ్
✒రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: డీకే అరుణ
✒DSC ఫలితాలు విడుదల..1:3 పై ఫోకస్
✒నల్లమలలో టైగర్ సఫారీ రెడీ.. ఇక ఆన్లైన్ బుకింగ్