News August 14, 2025
MBNR: ASIకి భారత ప్రభుత్వ ఇండియా పోలీస్ మెడల్

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మొహమ్మద్ మొయిజుద్దీన్(ASI)కు ఇండియా పోలీస్ మెడల్(IPM) భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ డి.జానకి మొహమ్మద్ మొయిజుద్దీన్ని అభినందిస్తూ..“పోలీసు శాఖలో ఆయన చూపిన క్రమశిక్షణ, అంకితభావం, ప్రజా సేవ పట్ల నిబద్ధత ప్రశంసనీయం అన్నారు. ఆయన కృషికి లభించిన గౌరవం అని ఎస్పీ కొనియాడారు.
Similar News
News August 14, 2025
జడ్చర్ల: గల్లంతైన యువకుడి ఇతడే..!

చేపలు పట్టేందుకు వెళ్లి ఓ యువకుడు గల్లంతైన చెందిన సంఘటన జడ్చర్ల పట్టణంలో జరిగింది. స్థానికులు వివరాలు ప్రకారం.. పట్టణంలోని బోయలకుంటకు చెందిన భాను (24) కు ఏడాది క్రితం పెళ్లయింది. ఈరోజు సాయంత్రం వంద పడకల ఆసుపత్రి సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న ఓ మిత్రుడు కాపాడే ప్రయత్నం చేసిన వరద నీటిలో కొట్టుకుపోయాడని స్థానికులు అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.
News August 14, 2025
అత్యవసరం ఉంటే తప్ప బయటకి రావద్దు: జిల్లా కలెక్టర్

భారీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసరం పని ఉంటే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ విజయేంద్ర బోయి ప్రజలను కోరారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
News August 14, 2025
యూరియా అందుబాటులో ఉండేలా చూడాలి: కలెక్టర్

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని DCMS మన గ్రోమోర్ సెంటర్లను కలెక్టర్ విజయేంద్ర బోయి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్లను పరిశీలించి, యూరియా లభ్యత, పంపిణీ విధానం గురించి ఆరా తీశారు. యూరియా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ తనిఖీలో భాగంగా అక్కడున్న రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.