News March 25, 2025
MBNR: BJP స్టేట్ చీఫ్ రేసులో DK.అరుణ

తెలంగాణ BJPకి ఉగాదిలోపు కొత్త చీఫ్ వస్తారనే సమాచారం. దీనిపై పార్టీ అధిష్ఠానం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కాగా ఓసీ కేటగిరీలో MBNR ఎంపీ డీకే అరుణ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు MP రఘునందన్రావు, మాజీ MLC రామచందర్రావు, ఎంపీలు ఈటల, ధర్మపురి అర్వింద్ పేర్లు కూడా రేసులో ఉన్నాయి. పాలమూరుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో అరుణమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆమెకే ఇవ్వాలని స్థానిక BJP శ్రేణులు అంటున్నాయి.
Similar News
News November 11, 2025
పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయండి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. రైతులు తేమశాతం 12 లోపు ఉంచి పత్తి విక్రయించాలన్నారు. పత్తి కొనుగోలు సజావుగా సాగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా సమీప జిన్నింగ్ మిల్లుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని రైతులకు సూచించారు. కౌలు రైతులు కూడా యాప్లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
News November 11, 2025
ఏసీబీ వలలో డోన్ డిప్యూటీ తహశీల్దార్

డోన్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఓ రైతు పొలం సమస్య పరిష్కారానికి డోన్ డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు రూ.35,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసి దాడి చేశారు. లంచం తీసుకుంటుండగా సునీల్ రాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 11, 2025
ప్రొటో’కాల్’ భీమేశ్వరాలయానికే పరిమితం..!

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో PRO కార్యాలయం ద్వారా లభించే ప్రొటోకాల్ సేవలు భీమేశ్వరాలయానికి మాత్రమే పరిమితమయ్యాయి. ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే VIPలు, ప్రజాప్రతినిధులు, సిఫారసు లేఖలపై వచ్చే భక్తులకు పీఆర్ఓ కార్యాలయం ద్వారా సిబ్బందిని కేటాయించి రాజన్న దర్శనానికి పంపించేవారు. అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజన్న ఆలయంలో ఒకే క్యూలైన్ ద్వారా దర్శనాలు సాగుతుండడంతో ప్రొటోకాల్ సేవలు నిలిచిపోయాయి.


