News March 9, 2025
MBNR: “CMను కలిసిన పాలమూరు VC”

వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో మహిళా దినోత్సవ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు విశ్వవిద్యాల ఉపకులపతి ఆచార్య జిఎన్. శ్రీనివాస్ కలిసి విశ్వవిద్యాలయ అభివృద్ధి గురించి చర్చించారు. ఇంజనీరింగ్, లా కళాశాలల ప్రారంభోత్సవం, బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ, అదనపు పోస్టుల మంజూరు తదితర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News February 4, 2026
పాలమూరు అభివృద్ధికి రూ.300 కోట్లు మంజూరు: డీకే అరుణ

మహబూబ్నగర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. బుధవారం ఎంవీఎస్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సమ్మేళనం సభలో ఆమె మాట్లాడారు.. విమానాశ్రయాలకు దీటుగా అన్ని జిల్లాలలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
News February 4, 2026
దేవరకద్ర ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ

దేవరకద్ర ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. జీనుగరాలకు చెందిన వెంకటేష్ యాదవ్ లోన్ కోసం ఓ డాక్యుమెంట్పై ఎమ్మార్వో దీపిక సంతకాన్ని ఫోర్జరీ చేశారు. తప్పుడు సంతకంపై బ్యాంకు అధికారులు ఎమ్మార్వోకు సమాచారం అందించారు. దీంతో ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 4, 2026
మహబూబ్నగర్: అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులపై అవగాహన సదస్సు

మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించనున్నట్లు కమిషనర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్ కళాభవనంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా హాజరుకావాలని, ప్రచార ఖర్చుల వివరాల నమోదుపై కీలక సూచనలు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


