News March 26, 2025
MBNR: DEECET-2025 నోటిఫికేషన్ విడుదల

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్ష రాయడానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో అర్హత కలిగిన అభ్యర్థులు DEECET-2025 నోటిఫికేషన్ విడుదల చేశామని డైట్ ప్రిన్సిపల్ మేరాజుల్లాఖాన్ ఓ ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేదీ 01-09-2024 నాటికి 17 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలని, https://deecet.cdse.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలన్నారు.
Similar News
News March 28, 2025
RCBతో మ్యాచ్.. CSK 26/3

RCBతో జరుగుతున్న మ్యాచ్లో CSKకు బిగ్ షాక్ తగిలింది. 4.4 ఓవర్లలో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి 5, కెప్టెన్ రుతురాజ్ 0, దీపక్ హుడా 4 పరుగులకే ఔటయ్యారు. జోస్ హేజిల్వుడ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చేశారు. భువనేశ్వర్ ఒక వికెట్ తీశారు. క్రీజులో రచిన్ 16, కర్రన్ 0 ఉన్నారు.
News March 28, 2025
కేకేఆర్vsలక్నో మ్యాచ్ రీషెడ్యూల్

ఏప్రిల్ 6న (ఆదివారం) కేకేఆర్-లక్నో మధ్య జరగాల్సిన మ్యాచును రీషెడ్యూల్ చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. పండుగల కారణంగా తగినంత భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పారని.. దీంతో ఆ మ్యాచును ఏప్రిల్ 8న నిర్వహిస్తామని పేర్కొంది. ఇక ఏప్రిల్ 6న గుజరాత్-SRH మ్యాచ్ ఒకటే ఉంటుందని తెలిపింది.
News March 28, 2025
కడప జిల్లాలో తగ్గిన అరటికాయల ధరలు.!

కడప జిల్లాలో అరటి ధరలు అమాంతంగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం టన్ను రూ.6వేల నుంచి రూ.9వేలు పలుకుతున్నాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు అరటి గెలలన్నీ నేలకూలడంతో నష్టపోయిన రైతులను తగ్గిన అరటి ధరలు మరింత కుంగదీస్తున్నాయి. గతంలో టన్ను అరటికాయలు రూ.16 నుంచి రూ.18వేలు పలికాయి. ప్రభుత్వం స్పందించి అరటికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. = రైతులను = అరటికాయలు రూ.16 వేల