News March 17, 2024

MBNR: ఆలయాల్లో ధర్మకర్తల మండళ్లు ఏర్పాటుపై ఎదురుచూపులు

image

ఉమ్మడి జిల్లాలో అనేక ఆలయాల్లో ధర్మకర్తల మండళ్లు పనిచేయటం లేదు. పదవీ కాలం పూర్తయి నెలలు గడుస్తున్న కొత్త కమిటీల ఏర్పాటు రూపుదాల్చడం లేదు. జనవరిలో ట్రస్ట్ బోర్డుల నియామకానికి దేవాదాయ శాఖ ప్రకటన జారీ చేయగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల నియామక ప్రక్రియ ఆగిపోయింది. దీంతో పాలకమండలి సభ్యుల పదవీ కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు నిరాశలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో దేవాదాయశాఖలో మొత్తం 1340 ఆలయాలు ఉన్నాయి.

Similar News

News December 10, 2025

మహబూబ్‌నగర్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. గండీడ్ మండలం సల్కర్‌పేటలో అత్యల్పంగా 9.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిడ్జిల్ మండలం దోనూరులో 9.3, మిడ్జిల్‌లో 10.1, కోయిలకొండ సిరి వెంకటాపురం, భూత్‌పూర్‌లో 10.5, దేవరకద్రలో 10.9, కొత్త మొల్గ‌రలో 11.4, జానంపేటలో 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 10, 2025

MBNR: మూడో విడతలో 440 మంది సర్పంచ్ అభ్యర్థులు.!

image

మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మూడో విడత పోరు రసవత్తరంగా మారింది. ఈ విడతలో మొత్తం 440 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అడ్డాకల్, బాలానగర్, భూత్పూర్, జడ్చర్ల, మూసాపేట మండలాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జడ్చర్ల మండలానికి సంబంధించి ఒక గ్రామ పంచాయతీలో నామినేషన్ సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.

News December 10, 2025

MBNRలో తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు రేపు తొలి విడత పోలింగ్‌కు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రాజాపూర్, నవాబుపేట, మహబూబ్‌నగర్ రూరల్, మహమ్మదాబాద్, గండీడ్ మండలాలలో పోలింగ్ జరగనుంది. ఉ.7 గంటల నుంచి మ.1 గంట వరకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. మ.2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.