News April 11, 2024
MBNR, NGKL: 5ఏళ్లు.. 3,27,451 మంది ఓటర్లు

ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ ఐదేళ్లలో(10.67 శాతం) 3,27,451 మంది ఓటర్లు పెరిగారు. 2024 ఎన్నికల నాటికి MBNR లోక్సభ పరిధిలో 16,80,417, నాగర్కర్నూల్ పరిధిలో 17,37,773కు ఓటర్ల సంఖ్యం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 68వేల ఓట్లు నమోదుయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల పరిధిలో 18-39 ఏళ్ల మధ్య ఓటర్లు 52 శాతం ఉన్నారు. ఈ ఐదేళ్లలో 701 కేంద్రాలు పెరిగాయి.
Similar News
News April 22, 2025
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

MBNR ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 92 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని అధికారులను అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం ఫిర్యాదులను ఆ వారమే పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
News April 22, 2025
రైతుల దగ్గరికే అధికారులు: కలెక్టర్ విజయేంద్ర

మే1 నుంచి ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. భూ సమస్యలు, వివాదాలు తలెత్తకుండా భూభారతి చట్టం కింద వివరాలను డిజిటలైజేషన్ చేస్తారని అన్నారు. అడ్డాకులలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ పోర్టల్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
News April 22, 2025
MBNR: వేసవి కరాటే శిక్షణ శిబిరం

వేసవి కరాటే శిక్షణ శిబిరానికి సద్విని చేసుకోవాలని ఉమ్మడి ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ పి వెంకటేష్ కోరారు. వారు కరపత్రాలను విడుదల చేసి మాట్లాడుతూ.. విద్యార్థులు యువత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. మార్షల్ ఆర్ట్స్ తో శారీరకంగా మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఎదగవచ్చు అన్నారు. ఈ శిక్షణ శిబిరం ఏప్రిల్ 30 నుంచి జూన్ 11 వరకు నిర్వహిస్తున్నామన్నారు.